రామ భూమి
శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ రామచంద్రుని గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు వెలిశాయి. భక్తుల పాలిట కల్పతరువులుగా నేటికీ అవి విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుంటే అంతా రామమయమేనని అనిపించక మానదు. రామాయణంలో చెప్పిన ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు, భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెలసిన రామాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అహల్య శాపవిమోచనం పొందిన ఆశ్రమం, రామభద్రుడు గుహుడిని