మాయ మూగబోయేది ఒంటరితనంలోనే
గోపీ ఇచ్చిన ‘‘గోపాలుడి’’ అధరాల్లోంచి విచ్చుకునే దరహాస చంద్రికలు నా మనోమైదాన మంతా ఆక్రమిస్తున్నాయి. ఈ సమయంలో సి. నారాయణరెడ్డిగారి కవితా చరణాలు జ్ఞాపకం వస్తున్నాయి. పొదలోని వెదురుబొంగు మొదలంటూ విరిగిందనా నీ బాధ! రఘురాముని చేతిలో విల్ల్కె రాక్షసుల్ని పరిమార్చలేదా! పురివిప్పి ఆడే నెమలి ధర మీది కొరిగిందనా గోడు! బాలకష్ణుని మౌళిపింఛమై ప్రపంచాన్ని మురిపిస్తుంది చూడు! కొండమీది నుంచి చెంగున దూకిన సెలయేరు ఇసుకపర్రలోకి ఇంకి పోయిందనా దిగులు? పాతాళ గంగ ఝర్కియె మరలా పైకిలేస్తుంది చూడు. ప్రపంచాన్ని మరిచి, ప్రశాంతంగా సముద్ర తీరంలో