రాజా ధర్మానికి ఆద్యుడు భరద్వాజుడు
అంగీరసుడికి శ్రద్ధ అనే భార్య వలన ఇద్దరు కుమారులు కలిగారు. వీరిలో పెద్దవాడు ఉతధ్యుడు. రెండవ వాడు బృహస్పతి. కుమారు లిద్దరికీ తండ్రి వివాహం చేశాడు. ఉతధ్యుడి భార్య మమత. బృహస్పతి భార్య తార. ఇద్దరూ గృహస్థాశ్రమంలో సుఖంగా జీవించసాగారు. కాలం గడు స్తోంది. ఒకనాడు మమత భర్తను సమీపించి పుత్రుని ప్రసాదించాలని కోరగా ఉతధ్యుడు ఆమెను భోగించగా గర్భవతి అయ్యింది. భర్తకు సేవ చేస్తూ గర్భాన్ని రక్షించుకుంటూ కాలక్షేపం