చరణా కింకిణులు ఘల్లుఘల్లుమన..

కవిత్వం నా మాతృభాష.. కవిత నా శ్వాస.. కవిత నా చిరునామా అని ప్రకటించి, ‘ఇతివృత్తం మానవత్వం’ అని ఉద్ఘాటించి, సతతహరితంగా సాహితీ సృజన చేసిన కవితా పథింకుడు.. తెలుగు కీర్తిని, తెలుగు యశస్సును, తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాన్ని, తెలుగు పలుకుబడిని ఏలుబడిగా చేసుకుని తనకు తానుగా జగతినంతటికీ వ్యాపించిన కవితా తపస్వీ.. నత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది ‘సినారె’. ఆయన రాసిన కవితలు నిత్యనూతనం. నెత్తి మీద నీలి

ఆ అక్షరం విశ్వంభరం

రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది. సుకవి మరణిస్తే ఒక తార నింగికేగుతుంది. రాజు మరణానంతరం అతని రూపం ‘విగ్రహం’గా నిలుస్తుంది. సుకవి మాత్రం కలకాలకం జనుల నాలుకపైనే జీవిస్తాడు. ఎంత అక్షర సత్యం? సినారె మన మధ్య లేరన్న ఊసే లేదు. ఆయన, ఆయన కావ్యాలు, కవితలు, సినీ గేయాలు తెలుగునాట ఒక ‘ధ్యాస’గా నిలిచిపోతాయి. తెలుగు సాహిత్యానికి ఆయనో బ్రాండ్‍ అంబాసిడర్‍.. ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా దానికి ఆయనతోనే గ్లామర్‍.. బతికున్నంత కాలం అక్షరాలతో

స్పెల్లింగ్‍బీలో తెలుగమ్మాయి ప్రతిభ..!

టాలెంట్‍.. ఎవరి టాలెంట్‍వారిదే.. సందర్భాన్ని బట్టి వారివారి టాలెంట్‍బయటపడుతుంటుంది. ముఖ్యంగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోరకమైన టాలెంట్‍ ఉంటుంది. అయితే అది అవకాశం వచ్చినప్పుడు నిరూపించు కున్నప్పుడే వారి ప్రతిభ బయటకొస్తుంది. కొందరు అద్భుతంగా రాయగలరు, ఇంకొందరు పాడగలరు. మరికొందరు అద్భుతంగా ఆడగలరు. ఏదో ఒకరకంగా.. ఎప్పుడో ఒకప్పుడు వారి టాలెంట్‍ ప్రూవ్‍ చేసుకుంటూ ఉంటారు. అలా ఉచ్ఛారణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 40 వేల డాలర్లు సొంతం చేసుకుంది ఎన్నారై

భారత అమ్మాయికి అరుదైన గౌరవం

భారత దేశానికి చెందిన 16 ఏళ్ల బెంగ ళూరు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. నీటి నాణ్యతను పెంచే దిశగా ఆమె చేసిన క•షికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్అవార్డు దక్కడంతో పాటు విశ్వంలోని ఓ చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు. పన్నెండో తరగతి చదువుతున్న సాహితి పింగళికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల లాస్‍ఏంజిల్స్లో జరిగిన ఇంటెల్‍ఇంటర్నేషనల్‍ సైన్స్ అండ్‍ ఇంజనీరింగ్‍ఫెయిర్‍లో సాహితి పాల్గొన్నది.

నాసా చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన ప్రవాస భారతీయుడూ

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి భారతసంతతికి చెందిన యూఎస్‍ఎయిర్‍ఫోర్స్ లో లెఫ్టినెంట్‍కల్నల్‍గా పనిచేస్తున్న రాజాచారి చోటు దక్కించుకున్నారు. ఎర్త్ఆర్బిట్‍అండ్‍డీప్‍స్పేస్‍మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది . ఈ 12 మందిలో రాజాచారి ఒకరు కావటం భారతీయులు గర్వంచదగ్గ విషయం. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో

Top