నాసా చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన ప్రవాస భారతీయుడూ

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి భారతసంతతికి చెందిన యూఎస్‍ఎయిర్‍ఫోర్స్ లో లెఫ్టినెంట్‍కల్నల్‍గా పనిచేస్తున్న రాజాచారి చోటు దక్కించుకున్నారు. ఎర్త్ఆర్బిట్‍అండ్‍డీప్‍స్పేస్‍మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది . ఈ 12 మందిలో రాజాచారి ఒకరు కావటం భారతీయులు గర్వంచదగ్గ విషయం. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్ఇ న్‍స్టిట్యూట్‍ నుంచి ఎరోనాటిక్స్అండ్‍ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్‍డిగ్రీ, అమెరికాలోని నావెల్‍టెస్ట్పైలట్‍స్కూల్‍నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 461 ఫ్లైట్‍టెస్ట్స్క్వాడ్రన్‍లో కమాండర్‍గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డస్ఎయిర్‍ఫోర్స్బేస్‍లో ఉన్న ఎఫ్‍-35 ఇంటి
గ్రేటెడ్‍టెస్ట్ఫోర్స్కు డైరెక్టర్‍గా ఉన్నారు.

గ్రామాలను దత్తత తీసుకున్న ఎన్నారైలు..
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయ్యాలన్న లక్ష్యంతో భూశాస్త్రజ్ఞులు, వ్యవసాయ నిపుణులతో కలసి పనిచేస్తున్నట్లు ఓవర్సీస్‍వలంటీర్‍ఫర్‍బెటర్‍ఇండియా ఓవీబీఐ అధ్యక్షుడు సతేజ్‍ చౌదరి తెలిపారు. భారత్‍లో వెనుకబడిన 500 గ్రామాలను అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు దత్తత తీసుకుంటున్నారు. జూలై ఒకటిన సిలికాన్‍వ్యాలీలో జరిగిన బిగ్‍ఐడియాస్‍ఫర్‍బెటర్‍ఇండియా సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగిత ఆధారంగా 500 గ్రామాలను ఎంపిక చేశారు. సుమారు వెయ్యి మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇక ఈ సదస్సులో ఆధ్మాత్మిక గురువు శీశ్రీ రవిశంకర్‍ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Review నాసా చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన ప్రవాస భారతీయుడూ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top