పుణ్యభూమి

ఎన్నో విశేషాలకు నెలవు పొత్తీశ్వరాలయం. ఈయననే పుట్టీశ్వరుడని కూడా పిలుస్తారు. ఈ శివలింగం దేవాలయం గర్భగుడిలో చాలా లోతులో ఉంటుంది. శివలింగాన్ని తాకితే పొట్ట భాగం (ఉదరం)లా మెత్తగా తగులుతుంది. సమీపంలోనే మహేంద్రతనయ నది ప్రభావమో.. ఏమో.. లింగం ఎప్పుడూ తేమగా, తడిగా ఉంటుంది. ఇక్కడ ఆవు గుండెకాయను పోలిన రాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. అర్జునుడు ఖడ్గమృగం వేటకు వెళ్లి గోవును చంపాడట. గోహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ

తెలుగు ‘పాట’వం

జగములేలే వాడవు జనార్దనుడవు తగ నీవారమై నేము ధర నెట్టుండినాను ।।పల్లవి।। గతి నీవు మతి నీవు కాణాచి చోటు నీవు సతమై యన్నిటికిని సాక్షివి నీవు చతురవత వలసితే జరతుము కొలుతుము తతి నేము సేసిన తప్పులు లోగొనవే ।।జగము।। తల్లియు దండ్రియు నీవు దాత దైవము నీవు యెల్లవారికి బరము నిహము నీవు మల్లడి నొక్కొకవేళ యరతుము తలతుము చల్లగా మానేరములు సైరించుకొనవే ।।జగము।। దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు పరగ శ్రీవేంకటేశ పతివి నీవు విరివిగా నేమైనా వేడుదుము నుతింతుము శరణుచొచ్చితి మిక క్షమియించుకొనవే ।।జగము।। అవతారిక: జనుల అర్ధన

మంత్రపుష్పం

సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన వేదమంత్రం- గాయత్రీ మంత్రం. సూర్యుడి (సవితు)ని ఉద్దేశించి బుద్ధిని సన్మార్గంలో నడపాలని కోరే ప్రార్థన ఇది. రుగ్వేదంలోని ఈ మంత్రాన్ని తొలుత విశ్వామిత్ర మహర్షి దర్శించి లోకానికి పరిచయం చేశారు. దీనిని నిత్యం జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి. న గాయత్య్రా: పరంమంత్రం నమాతు: పరదైవతమ్‍ తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని పై శ్లోకార్థం. ‘గయ’, ‘త్రాయతి’

పలుకు‘బడి’

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఏటావలి గిలిగింతలు ఏరు అంటే ప్రవాహం. వాగు. దానికి

వస్తుగుణ దీపిక

బ్రాంది: దీనిని మితంగా తీసుకుంటే మనోల్లాసం కలుగుతుంది. పొట్టకు బలాన్ని చేకూరుస్తుంది. వేడి చేస్తుంది. పురటాళ్లకు మంచిది. శరీర శ్రమను, వంటి నొప్పులను పోగొడుతుంది. చెవిపోటు అనిపించినపుడు చెవిలో కొద్దిగా పోసుకుంటే పోటు తగ్గుతుంది. అలాగే చెవిలో నొప్పి కూడా తగ్గుతుంది. నరాలకు సత్తువనిస్తుంది. పంటినొప్పి, చిగుళ్ల వాపు ఉన్న వారు దీనిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే నొప్పి తగ్గి, చిగుళ్ల వాపు కూడా పోతుంది. అజీర్ణాన్ని పోగొడుతుంది. భూశర్కర దుంప: తియ్యగా ఉంటుంది.

Top