ఔరౌర.. ఇగురావ కూర!
క్రీడాభిరామం.. ఈ గ్రంథం నాటి జనుల ఆచార వ్యవహారాలు, ఆహార నియమాల గురించి ఎన్నో వివరాలు అందిస్తోంది. వినుకొండ వల్లభరాయుడు ఈ గ్రంథకర్త. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ఇందులో ఉంటాయి. చలికాలంలో ప్రజలు ఇగురావకూరతో, కొత్తబియ్యం అన్నం, మీగడ పెరుగుతో, నేతితో తినేవారని ఈ క్రింది పద్యం చెబుతోంది. శీతకాలంబు కడి మాడ సేయ గుడుచు భాగ్యవంతుడు ఱేపాడి పల్లెపట్ల గ్రొత్త యోరెంబు నిగురావకూరతోడ బిఛ్చిలంబైన నేతితో బెరుగుతోడ ఈ పుస్తకంలోనే ‘కొర్రయో