ఆలయ దర్శనం
కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకోవడమే భాగ్యంగా భావించే భక్తులు కోకొల్లలు. అయితే, భగవంతుని సన్నిధిలో చేతనైన సేవ చేసుకుని తరించాలని, తద్వారా పుణ్యం పొందాలని తలచే భక్తులూ పెద్దసంఖ్యలోనే ఉంటారు. అటు శ్రీవారి దర్శనంతో పాటు.. ఇటు ఆయన సన్నిధిలో తోటి భక్తులకు సేవలందించడం మహత్కార్యంగా భావించే వారికి మాధవుడి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం




