తృణావర్తుడు
శ్రీగర్గ భాగవతంలోని కథ. ఒకనాడు ముద్దుకృష్ణుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆడిస్తోంది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రాక్షసుడు పెద్ద సుడిగాలి రూపంలో అక్కడకు వచ్చి చుట్టుముట్టాడు. ఉన్నట్టుండి కొండంత బరువెక్కిన చిన్ని కృష్ణుడి భారం భరించలేక యశోద అతడిని నేలపైకి దించింది. జంతువులు, ప్రజలు, ఇంటి పై కప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగిరిపోసాగాయి. ధూళి రేగగా, శ్రీకృష్ణుడు యశోదకు, గోపికలకు కనిపించలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని కోసం