రాముడు చెక్కిన ఆంజనేయుడు

శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే. శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీ తీరాన ఉందీ వాయు క్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‍ । భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్‍ ।। అంటే.. శ్రీరామ సంకీర్తన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో

మంత్ర పుష్పం

మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రా లున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్ర మైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు. మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగు తాయని అధర్వణవేదం చెబుతుంది. ‘మన్‍’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది.

।। రుద్ర నామం భజే ।।

శివరాత్రి మహాత్మ్యాన్ని వర్ణించే కథలు- లింగ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. లింగ పురాణంలో వర్ణించిన ప్రకారం- ఒకనాడు కైలాస శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాశీనులై ఉన్నారు. పార్వతి- ‘దేవ దేవేశా! అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైన వ్రతం, భుక్తి, ముక్తి ప్రదాయకమైన దానిని గురించి తెలిపి నన్ను కృతార్థురాలిని చేయండి’ అని కోరింది. దీంతో శివుడు- దేవీ! శివరాత్రి వ్రతం ఒకటుంది. అది పరమ రహస్యం. సర్వయజ్ఞ

నేనే శివుడిని

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీవు ఎవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి- ‘చిదానంద రూప: శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అనే పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని. నేనే శివుడిని’ అని మనసులో అనుకున్నా, పైకి అన్నా

జ్ఞాన శక్తికి ప్రతీక శక్త్యాయుధం

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? ఆధ్యాత్మికంగా తమలపాకుల ప్రాధాన్యం ఏమిటి? హిందూధర్మంలో తమలపాకులను అష్ట మంగళాలలో (1.పూలు, 2.అక్షింతలు, 3.ఫలాలు, 4. అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క, 7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో, సంప్రోక్షణ చేసేటపుడు తమలపాకులనే వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తారు. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని

Top