సరి ‘కొత్త’ క్రాంతి

ఒక రాజు తన రాజ్యంలో జ్ఞానులందరినీ పిలిచాడు. ‘విజయంలో, ఓటమిలో, ఆనందంలో, దు:ఖంలో.. ఎలాంటి సందర్భంలోనైనా ఓ మంత్రంలా పనిచేసే మాటల్ని మీలో ఎవరైనా సూచించగలరా? మీరెవరూ సలహా ఇవ్వడానికి నాకు అందుబాటులో లేనపుడు ఆ మాట నాకు సాయపడాలి’ అని అడిగాడు. రాజు ప్రశ్నలకు జ్ఞానులందరూ మొదట అయోమయంలో పడ్డారు. చివరకు ఆలోచించగా, ఆలోచించగా, వారిలో ఒకరు చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. ఆ మాటల్ని వారంతా కాగితంపై రాసి రాజుకు ఇచ్చారు.

ఆదియందు వాక్యముండెను..

ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.. అమ్మ చేతి గోరుముద్దల్లా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే, తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాన్ని తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ

ఐదు రోజుల ఆనందం

దీపావళి పండుగ మన ఆచార, సంప్రదాయాల్లో విశేషమైనది. కృతయుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి. త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. ద్వాపరయుగం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన రోజు దీపావళి. దీపావళి అయిదు రోజుల పర్వం ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు గల ఈ ఐదు రోజులూ ఇంటి

శుభ ముహూర్తం

శ (పది) విధాలైన పాపాలను హరించేది ‘దశహరా’. అదే కాల క్రమంలో దసరా అయింది. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే దసరా ఉత్సవాల్లోని పరమార్థం. ప్రకృతిపరంగా పరిశీలిస్తే.. శరదృతువు ప్రసన్నతకు, ప్రశాంతతకు నిలయం. అప్పటి దాకా వర్షాలతో చిత్తడిగా మారిన నేలలన్నీ ఈ రుతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి. శరత్కాలంలో వెన్నెల పిండారబోసినట్టు ఉంటుంది. చంద్రుడి కళలు ఉత్క•ష్ట స్థాయికి చేరతాయి.

కృష్ణుడి అల్లరి.. గణపతి ఆకలి

అప్పుడప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టిన బుల్లి కృష్ణుడు.. నడుస్తూ నడుస్తూ దబ్బున పడతాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి విబూది పూతలా మారింది. ఉంగరాల జుత్తును పైకి దువ్వి, ముత్యాలహారంతో వేసిన ముడి చంద్రవంకలా ఉందట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రటి తిలకం ఫాలనేత్రంతా, రత్నాలహారంలో నాయకమణిలా ఉన్న నీలమణి శివుడి కంఠాన ఉన్న నల్లటి మచ్చలా, మెడలోని ముత్యాలహారాలు సర్పహారాల్లా అనిపించి.. బాలకృష్ణుడు అచ్చు శివుడే అనిపించాడట!. ఒకసారి పాలు తాగడానికి

Top