గురువే దైవమని..
ఆషాఢ మాసం నుంచి వర్ష రుతువు ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒకచోట ఎక్కువ కాలం గడపరు. కానీ, వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బంది కలగడమే కాక, వ్యాధులు సోకడానికి అవకాశం ఎక్కువ. అందుకే సాధారణంగా సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్యం పాటిస్తారు. అంటే, తాత్కాలికంగా ఎక్కడో ఒకచోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన

