వెయ్యి చేతుల బాణాసురుడు
బాణాసురుడు వెయ్యి బాహువులు కలిగిన వాడు. ఈయన బలి చక్రవర్తి కొడుకు. ప్రహ్లాదునికి ముని మనవడు. బాణాసురుడు తన తపశ్శక్తితో పరమశివుని కృపను సంపాదించి, ఆయనను మెప్పించి, తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకున్నాడు. బాణాసురుడంటే అటు స్వర్గలోకానికీ, ఇటు అసుర లోకానికీ హడలే. బాణాసురుడు ఒకసారి గర్వాంధుడై.. ‘పరమశివా! నువ్వు తప్ప నాతో యుద్ధం చేసే వారెవరూ లేరా?’ అని అడిగాడు. అతని అహానికి, మూర్ఖత్వానికి లోలోనే నవ్వుకున్న శివుడు-