నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం
నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం ఋష్యశృంగ మహర్షి శ్రీ గాయత్రి మహత్మ్యాన్ని వర్ణిస్తూ, ‘సమస్త ప్రాణుల్లో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి. మోక్షానికి మూల కారణమైన సారూప్య మూర్తికి స్థానం గాయత్రి’ అని చెప్పాడు. శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలోనూ ప్రతి అక్షరానికీ ఒక దేవత ఉంది. ఒక్కో అక్షరంలో ఆ దేవత శక్తి అంతర్హితమై ఉంది. అంటే, ఒక్క గాయత్రి మంత్రం ఇరవై నలుగురు దేవతల దైవీశక్తిని అందుకుని ఉంది.