ఉపయుక్తం
పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది కానీ, తీరా వెళ్లాక అక్కడ వసతి ఎలా? ఎక్కడుండాలి? ఎక్కడ తినాలి? అనేవి పెద్ద సమస్యలు. ఊరు గాని ఊరు వెళ్తే అక్కడి విషయాలేమీ తెలియవు. అటువంటి పరిస్థితుల్లో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన సత్రం వారు దేశవ్యాప్తంగా దాదాపు పదహారు పుణ్యక్షేత్రాల్లో వసతి గదులు, భోజనశాలలతో కూడిన సత్రాలు నిర్వహిస్తున్నారని తెలిసి సంతోషం కలిగింది. నిజంగా దైవ దర్శనార్థం వెళ్లిన భక్తులకు వీరు తమ సత్రాల ద్వారా అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. సేవను మించిన పరమార్థం మరేదీ లేదు. అటువంటి సేవకు అంకితమైన కరివేన సత్రం వారికి అభినందనలు. వారి సేవా సంస్థ గురించి అందించిన వివరాలతో కూడిన తెలుగుపత్రిక మే నెల సంచిక ఎంతో ఉపయుక్తమైన సమాచారాన్ని అందించింది.
-కె.పవిత్ర, నిఖిల్ వర్మ, కనిక రవికుమార్, కె.సునీల్, లలిత, చలపతిరావు, చందు వెంకటరావు, తిరుపతిరావు, హెచ్.రవీందర్, రాజమల్లు, ఆర్.మధుసూదనరావు, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
అన్నదాన పాధ్రాన్యం
ఆయా పుణ్యక్షేత్రాల విశేషాలతో పాటు ఆయా క్షేత్రాల్లో అన్నదానం చేయడం వల్ల కలిగే ఫలితాలను కరివేన సత్రం సేవతో ముడిపెడుతూ ఇచ్చిన క్షేత్ర విశేషాలు బాగున్నాయి.
– ఈడ్పుగంటి రవితేజ,
హైదరాబాద్















































































Review ఉత్తరాయణం.