తిరుమల దర్శిని
‘శ్రీనివాసా..’ అంటే చాలు మనసంతా తేలికైపోతుంది. ‘ఆపద మొక్కులువాడా..’ అని పిలిస్తే చాలు క్షణంలో మనసంతా ఆనందంతో నిండిపోతుంది.. అలుపూ సొలుపూ లేకుండా ‘గోవింద’ నామాలను స్మరిస్తూ శ్రీవారిని మెట్ల మార్గంలో వెళ్లి దర్శించుకోవాలంటే.. సులువైన మార్గాలున్నాయి. గతంలో వేసవి సెలవుల్లోనూ, ఇతరత్రా సెలవు రోజుల్లోనూ తిరుమలలో రద్దీ ఉండేది. ఇప్పుడు సెలవులతో నిమిత్తం లేకుండా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎప్పుడు చూసినా రద్దీ గణనీయంగా ఉంటోంది.




