వెలకట్టలేని కానుక

బేతాళుడి ప్రశ్నకు రాజు చెప్పిన తెలివైన సమాధానం కన్నా రాజుకు మౌనభంగమైనందుకు బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు.. చిన్నప్పుడు మనం చదువుకున్న బేతాళుడు- విక్రమార్కుడి కథలోని ఈ ముగింపు వాక్యం మనకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే బేతాళుడు తిరిగి చెట్టెక్కితేనే మనకు తిరిగి చదువుకోవడానికి మరో కథ దొరుకుతుంది మరి! కథలంటే మనిషికి ఎంతో ఇష్టం. అవి మనిషి రాసిన కట్టు కథలైనా.. మనిషి జీవితాన్ని రాసిన నిజం కథలైనా! అందుకే ఆ కథల్ని చెప్పే

సింహాచల స్వామి చందనమయ

నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్య మండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి, మూలాధారానికి, విశ్వచైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నారసింహ తత్త్వం. సింహాచల స్వామి చందనమయ లింగాకృతిలో సదా దర్శనమిస్తూ శివకేశవుల అభేదానికి ప్రత్యక్ష నిదర్శనమై భక్తకోటిని అనుగ్రహిస్తుంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే శ్రీ నరసింహావతార ఉద్దేశం. తెలుగునాట

తెనాలి రామలింగం తెలివి

తెనాలి రామలింగం కాళికా దేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కాని ఏమి లాభం? ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరూ లేరు. ఒక్క విజయనగరం మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు. ఇన్ని ప్రయాసలు పడి అక్కడకు చేరుకున్నా రాజుగారి దర్శనం దొరకడం అంత సులభం

కాకమ్మ కథ

కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. ‘కాకి చిరకాలమున్న నే కార్యమగును?’ అనే పద్యం చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు. ‘లోకులు పలుగాకులు’ అనే సామెత కూడా ఒకటి ఉంది. ఈ విధంగా మనం కాకులను తక్కువ చేస్తూ మాట్లాడుకుంటుంటాం. కానీ, కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మనింటికి చుట్టాలు వస్తారని అర్థం. చనిపోయిన వాళ్ల మనసుల్లో

రైభ్య మహర్షి

రైభ్యుడు చిన్నతనం నుంచే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఆయనకు గురుభక్తి చాలా ఎక్కువ. గురువు గారి కంటే చాలా ముందే నిద్ర లేచి ఆయన తిరిగి పడుకునే వరకు ఆయనకు కావాల్సిన సేవలు, సపర్యలు చేసి అనంతరం మిగిలిన సమయంలో చదువుకునే వాడు. గురువు గారు కూడా ఇతని గురుభక్తికి సంతోషించి అన్ని వేద శాస్త్రాలు రైభ్యుడికి బాగా వంటబట్టేటట్టు నేర్పించారు. మొత్తం అన్నీ నేర్చుకున్నాక గురువు గారి ఆజ్ఞ తీసుకుని బృహస్పతి

Top