భగవంతుని సన్నిధికి…
మనకు ఆత్మీయులు అనుకునే వారు దూరమైనపుడు మాటలు పెగలవు. కళ్లు నీటితో నిండిపోతాయి. మనసు మౌనంగా రోదిస్తుంటుంది. హృదయం.. మనకు దూరమైన వారి జ్ఞాపకాల తడితో బరువెక్కుతుంది. మనసులో చెలరేగే వేదన.. మాటలకు అందదు. క్రెగ్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త విన్న క్షణం నుంచీ నాదీ ఇదే అనుభవం. ఆయన తోడిది పరిచయం యాదృచ్ఛికం కాదు. దైవ నిర్ణయం. స్వయంగా సాయినాథుడే మా ఇద్దరినీ కలిపాడు.