ప్రాణం తీసిన దురాశ

సంస్క•త భాషలో అద్భుతమైన నీతి కథలను నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. ‘హితోపదేశం - మిత్రలాభం’లో నారాయణ కవి చెప్పిన గొప్ప నీతి ఉన్న చిన్న కథ ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్లి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించుకునే వాడు.

అణువణువున

సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగితజ్ఞానం చాలు. ‘నేను దేవుడిని చూడగలనా’ అనే ప్రశ్న వేదాంతపరమైనది. సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు. ఈ ప్రశ్న అడిగినవారికి దైవం గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి. వారు మనసులో దైవమంటే ఇది, అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచు కొని అడుగుతున్నారు. ‘దైవాన్ని చూడగలమా’ అనేది మీ ప్రశ్న. ‘దైవాన్ని తప్ప

పసిపాప పరమగురువు

తల్లీ బిడ్డల సహజీవనంలోని ఆధ్యాత్మిక బంధాన్ని అవగాహన చేసుకున్న వారికి ఏ మతగ్రంధమూ పఠించవలసిన అవసరం రాదు. ఏ ప్రవర్త బోధలతోనూ పనిలేదు. బాల్యమనే బంతిపువ్వు, అమాయకత్వపు కొమ్మతో భగవంతుడనే మొక్కను గట్టిగా పట్టుకుని ఉంది. అందుకే పిల్లలూ, దేవుడూ కల్లకపట మెరుగని కరుణామయులని కవులు కొనియాడారు. ఒకవైపు, ఏమీ తెలియని పాప అమాయ కత్వం, మరొక వైపు అన్నీ తెలిసిన అమ్మ జ్ఞానం. ఈ విరుద్ధద్వంద్వాల వింతబంధం అవగాహన చేసుకుంటే

‘అనంత’శ్రేయస్సు మీ సొంతం

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దేశించారు. ఆ సమయంలో ఉండే వాతావరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతాయి. సెప్టెంబరు

చిన్ముధ్రరూపంలో.. చిదాత్మగా…

దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి - స్థితి - లయాలకు కారణభూతుడైన పరమ గురువును తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది. రాహుగ్రస్త దివాకరేందుసదృశో మాయా

Top