ఆదిశంకరుని మూడు దోషాలు

ఆదిశంకరులు ఒకసారి శిష్యులతో కలిసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.గంగా నదిలో స్నానం చేసి, దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లి, విశ్వేశ్వరుని ఎదుట నిలిచి ఇలా ప్రార్థించారు- ‘స్వామీ! నేను మూడు దోషములు (పాపాలు) చేశాను. నన్ను క్షమించండి’. ఈ విధంగా శివుడిని వేడుకున్నారు. ఇది విన్న శిష్యులు- ‘ఆచార్యుల వారు ఏం పాపాలు చేశారని పరమశివుని ఎదుట ప్రాయశ్చిత్త మడుగుతున్నారు?’ అని అనుకున్నారు. ఒక శిష్యుడు మాత్రం, ఆది శంకరుల వారు ఏం

వినదగు నెవ్వరుచెప్పిన.

వినసొంపుగా చెప్పే వారు ఉంటే సరిపోదు. శ్రద్ధగా వినే వారు ఉండాలి. సావధానంగా చెవులు రిక్కించి వినే వాళ్లుంటే కుదరదు. విషయాన్ని ఓపిగ్గా విడమరచి చెప్పే వారు ఉండాలి. ఇది గురుశిష్యుల ప్రాథమిక లక్షణం. లోకాస్సమస్తా సుఖినో భవంతు.. గురు శిష్య పరంపర ఈనాటికీ భారతావనిలో అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం- ‘గురువు చెప్పడం - శిష్యుడు వినడం’ అనే సూత్రం. ఆధ్యాత్మిక జీవన వికాసంలో ప్రస్తావించే శ్రవణం, మననం, నిధి ధ్యానం, సాక్షాత్కారాలకు చాలా ప్రాముఖ్యం

నవ వసంత కోకిల

అమ్మకు ఉగాది శుభాకాంక్షలతో, మనస్సులతో ... వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది పసి వత్సరం నేడు పల్లవించింది. జీవకాంతుల్లేని శిశిరశిథిలాంగాల హిమసమాధులపై సుమసమూహం చల్లి నవ వసంతోదయం నాట్యమాడింది. గతకాల బూజుదశ గడచి సీతాకోక చిలుక పలురంగుల చీర గట్టింది కుసుమ వీధులచేరి కులుకులాడింది -గుంటూరు శేషేంద్ర శర్మ రాము ఇక్కడి నుండి వెళ్ళేపుడు - ‘‘అమ్మకు ఉత్తరం రాయండి’’, ‘‘ఉగాదికి తప్పక అనంత పూర్‍కు రండి’’ - అని చెప్పి వెళ్లాడు. మొదట్లో ఈ రెండింటిలో ఏదీ చేయలేకపోతానేమోనని భయపడి బాధపడ్డాను. కనీసం ఒక

అనగనగ ఏడు చేపలు…

‘అనగనగా ఏడుగురు రాజ కుమారులు. ఒకనాడు వేటకు వెళ్లి ఏడు చేపలను వేటాడారు...’ చిన్నప్పుడు అందరూ నానమ్మ, అమ్మమ్మలను, తాతయ్యలను అడిగి పదేపదే చెప్పించుకున్న కథ ఇది. ఈ కథ వినని వారు నిన్నటి తరం వరకూ ఎవరూ ఉండి ఉండరు. అయితే, ఇది చిన్నపిల్లల కథ మాత్రమే కాదు సుమా! ఇందులో నేర్చుకోవడానికి చాలా ఉంది. అందుకే ఇది ఈ కాలం పెద్దలకూ ఉపయోగపడేలా, ఆధ్యాత్మిక వికాసం కలిగించేలా

నీ గర్వమే నీ పతనం

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

Top