రామేశ్వరం..

లోకంలో మనుషులు ‘దాత - అదాత’ అని రెండు రకాలుగా ఉంటారట. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా.. ఇతరులను కూడా దానం చేయనివ్వకుండా తాను మాత్రమే తినేవాడు అదాత. దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అతడిని అగ్ని నశిపంచేస్తాడు. ఈ విషయాన్ని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది. ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానమట. దాత, అదాత ఇద్దరూ.. అన్న సంపాదనకు

జోగులాంబ నిజరూప దర్శనం

ఆకలితో గుక్కపట్టిన శిశువు తల్లి స్తన్యం నుంచి పాలచుక్కలు గొంతులో పడగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. వానజల్లు లక్షలాది చినుకులుగా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి సారవంతం చేసినట్టు.. ఒక్క మెతుకు శరీరాన్ని తేజోవంతం చేసి బతుకు నిలుపుతుంది. ఒకసారి భృగు మహర్షికి పరమాత్మ ఎవరో తెలుసుకోవాలనే కోరిక పుట్టిందట. ఘోర తపస్సు చేశాడు. బుద్ధి, ప్రాణం, అన్నం వంటివి కూడా పరబ్రహ్మమేనని గుర్తించాడు. జీవులన్నిటికీ ప్రాణాధారమైనది ఆహారం. అందుకే ఆహారాన్ని

అన్నమో రామచంద్రా! అని నానుడి. ఆకలితో ఉన్న వారు

ఆహారం కోసం.. ఆదుకునే వారి కోసం శ్రీరాముడిని వేడుకునే పిలుపది. ఇది ప్రసిద్ధ తెలుగు వాక్యం. ఇది ఆకలి బాధను, రాముడిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. ‘ఓ రామచంద్రా! ఆకలితో ఉన్నాను.. ఆదుకో!’ అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. రాముడు నడయాడిన నేలంతా రామరాజ్యమే. అలాంటి రామరాజ్యంలో ఆకలితో ఎవరూ అలమటించరని, ఒకవేళ ఆకలితో ఉన్న వారు ఆ శ్రీరామచంద్రుడిని తలుచుకుంటే అన్నం దొరుకుతుందని హైందవ ధర్మంలో

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వారి నిత్యాన్నదాన కేంద్రం అందుబాటులో ఉంది. త్వరలో ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన భవనం నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతోంది. ప్రస్తుతానికి నిరతాన్నదానం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇక్కడకు నిత్యం ఎంతమంది భక్తులు వచ్చినా ఉచితంగా భోజన సదుపాయం కల్పించడానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భోజనశాలను కరివెన సత్రం నిర్వహిస్తోంది. అన్నదానమనే పవిత్ర కార్యాన్ని కరివెన నిత్యాన్నదాన సత్రం దాదాపు

తిరుమల దేవదేవుని దర్శనం అద్భుతమైతే..

అక్కడి శ్రీవారి భోజనశాలలో వడ్డించే అన్న ప్రసాదం మహాద్భుతం. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ వడ్డీకాసుల వాడి అన్న ప్రసాదాన్ని రుచి చూడకుండా వెనక్కి వెళ్లరు. ఇక్కడ నిత్యాన్నదాన నిలయాన్ని 1985లో ప్రారంభించగా, తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ను 2011లో ప్రారంభించారు. రోజూ వేలమందికి ఇక్కడ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇదంతా పూర్తిగా భక్తుల విరాళాలతోనే నడుస్తోన్న బృహత్కార్యక్రమం. అలాగే మరెన్నో సత్రాలు, నిత్యాన్నదాన కేంద్రాలు

Top