గోపీచంద్‍ ‘పంతం’

ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో పంతం పడతారు. ఏదైనా సొంతం చేసుకోవాలని కొందరు.. ఎవరినైనా అంతం చేయాలని మరికొందరు.. దుర్మార్గుల పని పట్టాలని ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరి పంతానికి ఏదో ఒక కారణం ఉంటుంది. గోపీచంద్‍ కూడా అలాగే ఓ మంచి పని కోసం పంతం పట్టాడు. అది దేని కోసమే తెర మీద చూడాల్సిందే అంటోంది చిత్ర బృందం. గోపీచంద్‍ హీరోగా సత్యసాయి ఆర్టస్ బ్యానర్‍పై కేకే రాధామోహన్‍ నిర్మిస్తున్న చిత్రానికి ‘పంతం’ అనే టైటిల్‍ను కన్ఫార్మ్ చేశారు. ‘ఫర్‍ ఏ కాజ్‍’ అనేది ఉప శీర్షిక. ఇది గోపీచంద్‍కు 25వ సినిమా. చక్రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. మే 18న సినిమాను రిలీజ్‍ చేయడానికి చిత్ర యూనిట్‍ సన్నాహాలు చేస్తోంది. మంచి మెస్సేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టు కుంటుందని అంటున్నారు.

Review గోపీచంద్‍ ‘పంతం’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top