శ్రీవల్లితో పుష్పరాజ్‌ ఆట..పాట

అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రానున్న ‘పుష్ప’ రిలీజ్‌కు ముందే హైప్స్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇటీవలే ‘దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ అదరగొట్టిన అల్లు అర్జున్‌.. తాజాగా ‘ఎవరికీ ఎప్పుడూ తలవంచని నేను.. నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను’ అంటూ పాటందుకున్నాడు. ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ పాట విడుదల కాగా, నెట్టింట్లో వైరల్‌గా మారింది. చంద్రబోస్‌ రచించిన ఈ పాటను సిద్‌ శ్రీరాం ఆలపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించాడు. డిసెంబర్‌ 17న పుష్ప విడుదల కానుంది.

Review శ్రీవల్లితో పుష్పరాజ్‌ ఆట..పాట.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top