గ్యాప్‍ ఇవ్వలేదు.. వచ్చింది.

త్రివిక్రమ్‍ మళ్లీ మరో సెల్యులాయిడ్‍తో తెలుగు ప్రేక్షకులను వీనులవిందు, కనువిందు చేసేందుకు రెడీ అయ్యారు. మాటల మాంత్రి కుడిగా పేరున్న ఈ దర్శకుడు తన సినిమాలను ఎక్కువగా ‘అ’తో మొదలుపెట్టడం సెంటిమెంట్‍. ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్‍ రిపీట్‍ కాబో తోంది. అల్లు అర్జున్‍ హీరోగా ‘అల వైకుంఠ పురములో..’ అనే సినిమాను ఆయన తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా టైటిల్‍ టీజర్‍ ఇటీవలే విడుదలైంది. ఇందులో మురళీశర్మ ‘ఏంటీ గ్యాప్‍ ఇచ్చావు?’ అని ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అని అల్లు అర్జున్‍ బదులిచ్చారు. నిజానికి అల్లు అర్జున్‍కు గత ఏడాది కాలంగా సినిమాలేవీ చేయలేదు. ఆ గ్యాప్‍ను ఈ డైలాగ్‍కు సరదాగా అన్వ యించుకుంటున్నారు ఫ్యాన్స్. అన్నట్టు ఈ సినిమాకు అల్లు అర్జున్‍ నిర్మాత కూడా. పూజాహెగ్డే హీరోయిన్‍. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

Review గ్యాప్‍ ఇవ్వలేదు.. వచ్చింది..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top