ప్రిన్సిపాల్‍గా కృష్ణవంశి

సందీప్‍కిషన్‍ కథానాయకుడిగా ‘నక్షత్రం’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‍ కథానాయిక. ఇంకా సాయిధరమ్‍తేజ్‍, రెజీనా, ప్రకాశ్‍ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్‍ కష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులతో ట్విట్టర్‍లో షేర్‍ చేసుకున్నాడు సందీప్‍కిషన్‍. ‘నక్షత్రం స్కూల్‍ ప్రిన్సిపాల్‍ కృష్ణవంశీతో గంగ మరియు రాంబాబు’ అంటూ ట్వీట్‍ చేశాడు. ఫోటోలో ప్రగ్యా తనని కొట్టిందని కృష్ణవంశీకి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తమాషాగా రూపొందించారు. గతంలో రిహార్సల్స్ సందర్భంగా ప్రగ్యా అనుకోకుండా సందీప్‍కిషన్‍ని కొట్టిన సంగతి తెలిసిందే. దాన్ని ఇలా ఇక్కడ సరదాగా ఉపయోగిస్తూ నవ్వులు పంచారు.

Review ప్రిన్సిపాల్‍గా కృష్ణవంశి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top