రజనీ ఆధ్యాత్మిక యాత్ర

సూపర్‍స్టార్‍ రజనీకాంత్‍ ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక యాత్ర చేయడం మామూలే. ఈసారీ ఆయన స్పిరిచ్చువల్‍ జర్నీ షురూ అయ్యింది. వారం పది రోజుల పాటు ఆయన సినిమాలకు, లౌకిక ప్రపంచానికి దూరంగా ఈ యాత్రను సాగించనున్నారు. తొలిగా ఆయన ధర్మశాల వెళ్లారు. అక్కడి శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత రిషికేష్‍కు బయల్దేరారు. అనంతరం హిమాచల్‍ ప్రదేశ్‍లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ వందేళ్ల వేడుకలో పాల్గొంటారు. అన్నట్టు.. ఈ యాత్రలో ఉన్న రజనీని మీడియా వదల్లేదు. అందుకు ఆయన జవాబుగా, ‘ఇటీవల పొలిటికల్‍ జర్నీ స్టార్ట్ చేశాను. ఆ ప్రయాణం కోసం ఈ ప్రయాణం (ఆధ్యాత్మిక యాత్ర)లో ప్రత్యేక పూజలు చేయాలని అనుకోవడం లేదు’ అని తనదైన శైలిలో చెప్పారు. ఏమైనా, రజనీ స్టైలే వేరు!

Review రజనీ ఆధ్యాత్మిక యాత్ర.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top