ఆయుర్వేదం రసాయన చికిత్స

ఏ ఆహార, విహార, ఔషధాలు సేవించడం వల్ల ముసలితనం రాకుండా ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా ఏ ఆహారం నివారిస్తుందో, వచ్చిన వ్యాధులను సమూలంగా నయం చేయగల చికిత్సా పద్ధతిని రసాయన చికిత్స అంటారు.
మనం నిత్యం రసాయన గుణాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నట్టయితే, రసాయ గుణాలు కలిగిన విహారాలు పాటించినట్టయితే, కొన్ని రసాయన గుణాలు కలిగిన ఔషధాలు సేవించినట్టయితే శరీర నిర్మాణానికి అవసరమైన మూలధాతువులైనటు వంటి రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రములనే సప్త ధాతువులు ప్రశస్తమైన, ఆరోగ్యవంతమైన ధాతువులుగా మారతాయి. దానివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా నివారణ జరుగుతుంది. అదేకాకుండా తొందరగా ముసలితనం రాకుండా వందేళ్లకు ఆయుష్సును పెంచుతుందీ రసాయన చికిత్స పద్ధతి.

Review ఆయుర్వేదం రసాయన చికిత్స.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top