ఫోర్బస్లో ఇద్దరు భారతీయ అమెరికను

అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితాను ప్రముఖ మ్యాగజైన్‍ ఫోర్బస్ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. బయోటెక్‍ పారిశ్రామికవేత్త వివేక్‍ రామస్వామి 24వ స్థానంలో నిలివగా.. అపూర్వ మెహతా 31 స్థానాన్ని దక్కించుకున్నారు.
రామస్వామి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేల్‍ స్కూల్‍ ఆఫ్‍ మేనేజ్‍మెంట్‍లో విద్యనభ్యసించారు. బయోటెక్‍ రంగంలో కంపెనీని స్థాపించి వ•ద్ధి పథంలో దూసుకుపోతున్నారని ఫోర్బస్ తెలిపింది. ఈయన కంపెనీ 2016లో స్టాక్‍మార్కెట్‍లో ముందస్తు పబ్లిక్‍ ఆఫర్‍(ఐపీవో)కు వచ్చింది. దీని ద్వారా ఆయన 218 మిలియన్‍ డాలర్ల షేర్లను నాస్‍డాక్‍లో విక్రయించారు. ఇక మెహతా సిలికాన్‍ వ్యాలీలోని యువ పారిశ్రామిక వేత్తల్లో ఒకరుగా నిలిచారని ఫోర్బస్ అభివర్ణించింది. భారత్‍లో పుట్టిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వచ్చారు. వాటర్లూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. అనంతరం బ్లాక్‍ బెర్రీ, క్వాల్కమ్‍, అమెజాన్‍లలో పనిచేశారు. 2012లో నిత్యావసరాలను సరఫరా చేసే సంస్థ ‘ఇన్‍స్టాకార్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. మెహతా నిర్వహిస్తున్న ఈ కంపెనీ విలువ 2 బిలియన్‍ డాలర్లు అని ఫోర్బస్ తెలిపింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్‍బర్గ్ 50 బిలియన్‍ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

Review ఫోర్బస్లో ఇద్దరు భారతీయ అమెరికను.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top