అమెరికాలో తెలుగు తేజాలు

తెలుగు సంతతికి చెందిన విద్యార్థులు అమెరికాలో సత్తా చాటారు. సైమన్స్ కాంపిటీషన్‍లో విజేతలుగా నిలిచి మొత్తం మూడు లక్షల డాలర్ల స్కాలర్‍షిప్‍ను సొంతం చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే ట్విన్‍ సిస్టర్స్ బీసం శ్రేయ, ఆద్య, వినీత్‍లు తమ సరికొత్త ప్రయోగాలతో వైద్యరంగంలోని నిపుణులతో ఔరా అనిపించారు. సైమన్స్ మాథ్స్, సైన్స్, టెక్నాలజీ పోటీలలో శ్రేయ, ఆద్య లక్ష డాలర్ల ఉపకార వేతనాన్ని పంచుకున్నారు. వ్యక్తిగత విభాగంలో టాపర్‍గా నిలిచిన వినీత్‍ ఈడ్పుగంటి మరో లక్ష డాలర్ల బహుమతి పొందారు. మానసిక వైకల్యాన్ని త్వరితంగా, కచ్చితంగా గుర్తించడంపై శ్రేయ, ఆద్యాలు చేసిన పరిశోధనలకు కచ్చితంగా గుర్తించడంపై శ్రేయ, ఆద్యాలు చేసిన పరిశోధనలకు అబ్బురపడిన న్యాయనిర్ణేతలు వారిని లక్ష డాలర్ల స్కాలర్‍షిప్‍తో సత్కరించారు. ఇక వినీత్‍ ఈడ్పుగంటి రూపొందించిన బయోడీగ్రేడబుల్‍ బ్యాటరీ, శరీరంలోని అవయవాలు, అంతర్గత పనితీరును పరీక్షించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Review అమెరికాలో తెలుగు తేజాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top