ఊర్మిళాదేవి మహా ప్రసాదం

రావణ సంహారం జరిగిపోయింది. రాముడు దిగ్విజయంగా అయోధ్యకు చేరకున్నాడు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాముడు సభలో కూర్చుని ఉండగా, యుద్ధానికి సంబం ధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తును చంపగలడు. లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రిజిత్తును చంపగలిగాడు’ అని ఎవరో అన్నారు.
ఆ మాటలు విన్న రాముడికి ఒక అనుమానం వచ్చింది. ‘పద్నాలుగేళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేందుకు నువ్వు నిద్రపోలేదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు?’ అని అడిగాడు.
‘మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని’ అని లక్ష్మణుడు బదు లిచ్చాడు.
లక్ష్మణుడు చెప్పిన మాటలు రాముడికి సబబు గానే తోచాయి. కానీ, సరదాగా ఆ ఆహారపు పొట్లా లన్నీ ఒకసారి లెక్కపెడదామని అక్కడున్నవారు అనుకున్నారు. దాంతో వాటిని రప్పించి సైనికు లతో లెక్కించారు. కానీ, లెక్కలో ఒక ఏడు రోజులు ఆహారం తగ్గినట్టు తేలింది.
‘లక్ష్మణా! ఏడు రోజుల పాటు ఆహారం గానీ ఆరగించావా? ఏం?’ అని పరిహాసంగా అన్నాడు రాముడు.
‘అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రి గారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసు కోనే లేదు. రావణుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తినాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని స్వీకరించ లేదు. నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్ర జిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే వీలే ఎవరికీ చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యా పాతకం జరిగిందన్న బాధతో ఆహా రాన్ని అందించలేదు. మర్నాడు రావణుడి కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భా లలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు’ అని లక్ష్మణుడు వివరించాడు.
లక్ష్మణుడి నిబద్ధతకు రాముడి మనసు కరి గింది. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా రాముడు ప్రసన్నుడయ్యాడు.
‘తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగం తోనే అక్కడ మేం అన్ని సమస్యలను తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటు నువ్వు కూడా మా పక్కనే ఆశీనురాలివై ఉండు’ అని అన్నాడు రాముడు.
రాముడి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మ గిల్లాయి. కానీ- ‘ప్రభూ! నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతి రోజూ నీ పాదాల చెంతకు చేరుకుని, నీ అనుగ్రహాన్ని పొందే నైవేద్యం రూపంలో నేను ఉండేలా నన్ను అనుగ్రహించు’ అని వేడుకుంది ఊర్మిళ.
‘కలియుగంలో పూరీ క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహానివేదనలో మహా ప్రసాదంలో నీవు కొలువై ఉంటావు’ అంటూ వరమిచ్చాడు రాముడు.
ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరీలోని జగ న్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహా ప్రసాదాన్ని ఆ అమ్మ వారికి నివేదించిన తరువాతనే భక్తులకు అందిస్తారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం

Review ఊర్మిళాదేవి మహా ప్రసాదం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top